రెండ్రోజుల్లో 1500 పడకల ఆసుపత్రి

by  |
రెండ్రోజుల్లో 1500 పడకల ఆసుపత్రి
X

కొవిడ్-19(కరోనా వైరస్) రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని 1500 పడకల ఆసుపత్రిగా మారుస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఆసుపత్రిని రెండ్రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన ఆరు ల్యాబ్‌లలో 24 గంటల పాటు కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

Tags: hospital, Gachibowli, corona victims, 1500 beds, hyderabad, health minister

Next Story