తల్లి సెల్‌ఫోన్ లాక్కుందని కొడుకు సూసైడ్

by  |
తల్లి సెల్‌ఫోన్ లాక్కుందని కొడుకు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లి సెల్‌ఫోన్ లాక్కుందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌లో 15ఏళ్ల బాలుడు తరచూ సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండగా తల్లి మందలించింది. అయినప్పటికీ పట్టించుకోని బాలుడు రాత్రి, పగలు సెల్‌ఫోన్‌ గేమ్స్‌లో నిమగ్నం కావడంతో ఆగ్రహించిన తల్లి గురువారం మధ్యాహ్నం మరోసారి బాలుడి నుంచి సెల్‌ఫోన్ గుంజుకుంది. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed