ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన 

by  |
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన 
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణ ఘటన వెలుగు చూసింది. పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్‌కు చెందిన యుగంధర్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలికను ఆరు నెలలుగా బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం.

గత కొంతకాలంగా యుగంధర్ వద్ద బాలిక పనిచేస్తోంది. బాలిక ఆరోగ్యం బాలేక పోవడంతో తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద యుగంధర్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story