ఖ‌మ్మంలో కొత్త‌గా 15 క‌రోనా కేసులు

by  |
ఖ‌మ్మంలో కొత్త‌గా 15 క‌రోనా కేసులు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో శుక్ర‌వారం కొత్త‌గా 15 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఇద్ద‌రు మృతిచెందారు. కొత్త‌గా న‌మోదైన వాటిల్లో 13కేసులు ఆక్టివ్‌గా ఉన్నాయి. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని గాంధీచౌక్ సెంట‌ర్ క‌రోనా హాట్‌స్పాట్‌గా మారింది. శుక్ర‌వారం వెల్ల‌డైన నిర్ధార‌ణ ఫ‌లితాల్లో మ‌రో నాలుగు కేసులు ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాక‌.. ఒక మ‌ర‌ణం కూడా ఇక్క‌డే చోటు చేసుకుంది. ఖ‌మ్మం జిల్లాలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు చేరుకుంది. ఆక్టివ్ కేసుల సంఖ్య 147గా ఉంది.

Next Story

Most Viewed