భారత్‌లో మొత్తం 18 కరోనా కేసులు!

by  |
భారత్‌లో మొత్తం 18 కరోనా కేసులు!
X

న్యూఢిల్లీ : భారత్‌లో పర్యటిస్తున్న 15 మంది ఇటాలియన్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో మన దేశంలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 18కి చేరింది. ముందస్తు చర్యల్లో భాగంగా వైరస్ విజృంభించిన ఇటలీ దేశానికి చెందినవారిపై అధికారులు నిఘా పెంచారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్‌లో దిగిన 21 మంది ఇటాలియన్లను దక్షిణ ఢిల్లీలోని ఐటీబీపీ క్వారంటైన్ ఫెసిలిటీకి తరలించారు. అక్కడ వారి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. ఇందులో 15 మందికి వైరస్ సోకినట్టు తేలింది.

Tags: coronavirus, italy, tested positive, delhi, ITBP

Next Story