141మంది సత్ర్పవర్తన ఖైదీలు విడుదల

by  |
141మంది సత్ర్పవర్తన ఖైదీలు విడుదల
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో వివిధ జైళ్లల్లో ఏళ్లుగా మగ్గుతున్న వారిలో సత్ప్రవర్తన కలిగిన పలువురు ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విడుదల చేయాల్సి ఉన్నా జాప్యం కావడంతో గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేశారు. శనివారం 141 మందిని విడుదల చేస్తున్నట్టు జైళ్ల శాఖ ప్రకటించింది. చర్లపల్లి జైలు నుంచి 22మంది, చంచల్‌గూడ జైలు నుంచి 13మంది మహిళలు, 15మంది పురుషులు, వరంగల్ సెంట్రల్ జైలు నుంచి 38మంది విడుదల కాగా పలువురు జిల్లాల జైళ్ల నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా, ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో నిజామాబాద్ జైలు నుంచి విడుదలయ్యే వారికి విడుదలకు బ్రేక్ పడింది.



Next Story

Most Viewed