మంచిర్యాలలో 141 కరోనా పాజిటివ్

by  |
మంచిర్యాలలో 141 కరోనా పాజిటివ్
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. బుధవారం జిల్లాలో 512 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 141 మందికి కరోనా నిర్ధారణ అయిందని, జిల్లా వైద్యాధికారి డాక్టర్ నీరజ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 106 మందికి వ్యాధి సోకగా మరో 36 మంది సింగరేణి కార్మికులకు వ్యాధి నిర్ధారణ అయినట్టు ఆమె తెలిపారు.

వ్యాధి సోకిన అయినటువంటి వ్యక్తులను ఐసోలేషన్ కేంద్రాలకు పంపించడంతో పాటు, హోమ్ క్వారంటైన్ విధిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ వ్యాధికి గురైన వారికి సరైన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Next Story