పటాన్‌చెరులో బాలిక అదృశ్యం

by  |
పటాన్‌చెరులో బాలిక అదృశ్యం
X

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధి ఇస్నాపూర్‌లోని వడ్డెర కాలనీలో 14ఏళ్ల బాలిక రాజ్యలక్ష్మీ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఈనెల 28న రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక… తెల్లవారుజామున 4గంటల సమయంలో తల్లిదండ్రులు లేచిచూడగా బాలిక కనిపించలేదు. చుట్టుపక్కల తెలిసిన వారి ఇళ్లు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బోరబండకు చెందిన కాళిదాసు అనే వ్యక్తిపై అనుమానం ఉందని తండ్రి సురేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed