కరోనాతో 14 నెలల చిన్నారి మృతి

by  |

కరోనా పసి పిల్లలను సైతం బలి తీసుకుంటుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 14 నెలల చిన్నారి కరోనాతో మృతి చెందింది. పాపలో కరోనా లక్షణాలు కనబడటంతో ఈ నెల 5న చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చిక్సిత పొందుతున్న చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. అయితే చిన్నారి తల్లిదండ్రులకు కరోనా పరీక్షలు చేయగా.. నెగటివ్‌గా తేలింది. కాగా, గుజరాత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 13 మంది చనిపోగా, 175 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags: corona, baby died, gujarat, national news

Next Story