మంచిర్యాలలో మళ్లీ మొదలైన కరోనా

by  |
మంచిర్యాలలో మళ్లీ మొదలైన కరోనా
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో కొవిడ్-19 కలకలం సృష్టించింది. సోమవారం 14 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యా బోధన చేస్తున్న 11 మంది ఉపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థితోపాటు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల్లో ఇద్దరికీ వ్యాధి సోకింది. వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా వైరస్ బయటపడింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు స్కూల్‌లో శానిటైజేషన్ చేపట్టారు. మిగతా విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో తప్పనిసరిగా కొవిడ్ రూల్స్ పాటించాలని సూచించారు.

Next Story

Most Viewed