యువతిపై 139 మంది అత్యాచారం

by  |
యువతిపై 139 మంది అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో సంచలనాత్మకమైన కేసు నమోదైంది. పంజాగుట్ట పీఎస్ లో తనపై 139 మంది అత్యాచారం చేశారని ఓ యువతి ఫిర్యాదు చేసింది. మొదట పోలీసులు షాక్ కు గురైనా.. ఆమె ఫిర్యాదు మేరకు వారందరిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ యువతి తనపై 139 మంది అత్యాచారం చేశారని శుక్రవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గతంలో తనతో పరిచయం ఉన్న వాళ్లే తనపై అఘాయిత్యం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు 139 మందిపై నిర్భయ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అనంతరం ఆ యువతి సోమాజిగూడలోని ఎన్జీవో ఆశ్రమాన్ని ఆశ్రయించింది. ఒకే యువతిపై అంత మంది అత్యాచారం చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Next Story

Most Viewed