ఈనెల 21న శంకుస్థాపన..

by  |
ఈనెల 21న శంకుస్థాపన..
X

దిశ, మెదక్: రూ. 21 కోట్లతో పటాన్ చెరువులో 132 కేవీ సబ్ స్టేషన్ ను నిర్మించబోతున్నట్లు పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్ చెరువు పట్టణ పరిధిలోని ట్రాన్స్కో డీఈ కార్యాలయం ఆవరణలో స్థలాన్ని డీఈ గోపాల్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈనెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


Next Story