ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాక్‌లోని సింధూ రాష్ట్రంలో వేగంగా వెళ్తున్న బస్సు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ముల్తాన్​ నుంచి కరాచీ వేళ్తున్న క్రమంలో బస్సు బోల్తా పడినట్లు సమాచారం. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ఆ దేశ మీడియా పేర్కొంది.



Next Story

Most Viewed