దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

by  |
దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కొనసాగిన ఏసీబీ అధికారులు సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని, అవినీతి సాక్ష్యాలను ప్రభుత్వానికి నివేదిక అందజేశారు అధికారులు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ కమిషనర్ 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అయిన వారిలో ఏడు విభాగాల్లోని ఐదుగురు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు, 8 మంది సిబ్బంది ఉన్నారు.

సస్పెండ్ అయిన వారు ఆలయ భూములు, షాపుల లీజు, అన్నదానం, ప్రసాదాల తయారీ, దర్శనాల టికెట్ల అమ్మకం, చీరల అమ్మకం విభాగాల్లో అవినీతికి పాల్పడినట్టు తేలింది. దీంతో వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జున్ రావు ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed