భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ

by  |
భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్న తగ్గిన కరోనా కేసుల సంఖ్య నేడు మళ్లీ పెరిగింది. బుధవారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 13,742 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176కి చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 1,56,567 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, దేశంలో ప్రస్తుతం 1,46,907 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,07,26,702 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 1,21,65,598 మంది టీకా తీసుకున్నట్లు పేర్కొంది.

ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా

Next Story

Most Viewed