దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by  |
carona 1
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044 కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 2,795 మంది మరణించారు . అదే సమయంలో 2,55,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,31,895కు పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,59,47,629 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.



Next Story

Most Viewed