ఒకే కుటంబంలో 12 మందికి కరోనా

by  |
ఒకే కుటంబంలో 12 మందికి కరోనా
X

దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌‌లో కరోనా విజృంభిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 12మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ జ్వరాలు వచ్చాయి. కరోనా సోకిందనే అనుమానంతో శనివారం మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా రావడంతో స్థానికులంతా భయాందోళనలో ఉన్నారు.

Next Story

Most Viewed