బస్సు బోల్తా.. 11 మంది మృతి

by  |
బస్సు బోల్తా.. 11 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పీఓకేలోని ముజఫరాబాద్‌లో ఓ బస్సు అదుపుతప్పి జీలమ్ నది ఒడ్డున ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. జమీనాబాద్ గ్రామం వద్ద జీలమ్ నది ఒడ్డున ముజఫరాబాద్-కోహాలా రహదారిపై రావల్పిండి నుంచి చకోథికి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed