- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పీఓకేలోని ముజఫరాబాద్లో ఓ బస్సు అదుపుతప్పి జీలమ్ నది ఒడ్డున ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. జమీనాబాద్ గ్రామం వద్ద జీలమ్ నది ఒడ్డున ముజఫరాబాద్-కోహాలా రహదారిపై రావల్పిండి నుంచి చకోథికి వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Next Story