అంత్యక్రియల్లో పాల్గొన్న 11మందికి కరోనా..

by  |
అంత్యక్రియల్లో పాల్గొన్న 11మందికి కరోనా..
X

దిశ, వెబ్ డెస్క్: మీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 11మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలియడంతో స్థానికంగా కలకలం రేపింది. ఓ వృద్ధుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఒకే కుటుంబానికి చెందిన 11మందికి కరోనా రావడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరికి సంబంధించిన ట్రావెల్ హిస్టరీ, ఎవరెవరినీ కలిశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ హోంకు తరలించారు.

ఈ విషయంపై మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్‌ను వెంటనే ట్రేస్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

Next Story

Most Viewed