11 మంది జూదరులు అరెస్ట్

by  |

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని రానాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం పేకాట స్థావరం‌పై పోలీసులు దాడి చేశారు. 11 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్ కోర్టుకు అటు నుంచి రిమాండ్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో టీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు ఉండడం గమనార్హం. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు మెరుపు దాడులు చేసి జూదరులను అరెస్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.



Next Story