తెలంగాణలో ఒక్క రోజే వెయ్యి కేసులు

by  |
తెలంగాణలో ఒక్క రోజే వెయ్యి కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాల్చుతోంది. పదులు, వందల నుంచి వేల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం ఒక్క రోజులోనే 1,087 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మరో ఆరుగురు చనిపోయినట్లు బెలెటిన్‌లో ధృవీకరించింది. ఇప్పటివరకు వైరస్ కారణంగా మొత్తం 243 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళనకరం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,436 కేసులు నమోదు కాగా 4928 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు ఒక్కరోజే 162 మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8265 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed