ఏపీలో 10,601 పాజిటివ్ కేసులు

by  |
ఏపీలో 10,601 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 70,993 మందికి శాంపిల్స్ పరీక్షించగా 10,601 మందికి పాజిటివ్‌‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,17,094కు చేరింది. 73మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 4,560గా ఉంది. ప్రస్తుతం 96,769 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని 4,15,765మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 11,691మంది ఆరోగ్యవంతులైనట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి గుంటూరు జిల్లాలో 10మంది ప్రాణాలు కోల్పోగా అనంతపురం జిల్లాలో 8మంది, చిత్తూరులో 8మంది, కడపలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు.

ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1,457 కరోనా కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరిలో 1,426, చిత్తూరు జిల్లాలో 1,178, పశ్చిమ గోదావరిలో 1,122, నెల్లూరులో 1,042, కడపలో 801, గుంటూరులో 702, విజయనగరంలో 598, కర్నూలు జిల్లాలో 514 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 42,37,070 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story

Most Viewed