- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఏపీలోకరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు కేసుల సంఖ్యల విపరీతంగా పెరుగుతోంది. రోజుకు 10వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 10,128మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 86వేల 461కి చేరుకుంది. ఇవాళ 77మంది వైరస్ బారిన పడి చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1681కి చేరింది. ఇవాళ 60,576మందికి శాంపిల్స్ పరీక్షించారు. కరోనా నుంచి కోలుకొని 8,729 మంది డిశ్చార్జ్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1544 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 22లక్షల 35వేల 646మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనాతో ఇవాళ గుంటూరు జిల్లాలో 16మంది చనిపోగా విశాఖపట్నంలో 12, శ్రీకాకుళం 10, చిత్తూరులో 8, తూర్పుగోదావరి 7, కృష్ణా 5, నెల్లూరు 4, కర్నూలు 3, విజయనగరం 3, పశ్చిమగోదావరి 2, అనంతపురం 2, కడప 2, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చనిపోయినట్లు ఏపీ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.