చేపల కోసం గాలం వేస్తుండగా.. బాలుడిని లాక్కెళ్లిన మొసలి

by  |
crocodile
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేపల కోసం వేటకు వెళ్లిన బాలుడిని మొసలి లాక్కెళ్లింది. వివరాల్లోకి వెళితే.. దాండేలి వినాయకనగర లోని కాళీ నది వద్దకు మోహీన్ మహమూద్ అనే 10 ఏళ్ల బాలుడు వెళ్లాడు. అనంతరం చేపల కోసం ఆ నది ఒడ్డున కూర్చోని గాలం వేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ నదిలోంచి ఓ మొసలి వచ్చి ఆ బాలుడిని లాక్కెళ్లింది. ఈ విషయాన్ని అతడి స్నేహితులు ఆ గ్రామస్తులకు తెలుపగా వారు వచ్చి ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు.


Next Story

Most Viewed