కోదాడలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

by  |
కోదాడలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం 22 కరోనా టెస్టులు చేయగా అందులో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో 4, నయానగర్‌లో 3, భవాని నగర్‌లో 3, కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే అనంతగిరి మండలంలో ఏడు టెస్టులు చేయగా ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ సుధీర్ చక్రవర్తి నిర్ధారించారు. అనంతరం అధికారులు పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

Next Story

Most Viewed