కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి

by Shyam |   (  Updated:2021-09-17 04:21:48  IST  )

<p>దిశ వాజేడు : ములుగు జిల్లా లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూరు పెట్రోల్ బంకు సమీపంలో 163 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తోన్న కారు బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్నవ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని వాజేడు మండల పరిధిలోని కోయవీరపురం గ్రామానికి చెందిన ఉయిక స్వామి(32)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంలో మృతి చెందిన స్వామి మృతదేహాన్ని ఏటూరు [&hellip;]</p>

కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి
X

దిశ వాజేడు : ములుగు జిల్లా లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూరు పెట్రోల్ బంకు సమీపంలో 163 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తోన్న కారు బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్నవ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని వాజేడు మండల పరిధిలోని కోయవీరపురం గ్రామానికి చెందిన ఉయిక స్వామి(32)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంలో మృతి చెందిన స్వామి మృతదేహాన్ని ఏటూరు నాగారం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Next Story