రూ.1.80 లక్షల ఎరువులు సీజ్

by  |
రూ.1.80 లక్షల ఎరువులు సీజ్
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: జిల్లాలోని వైరా, తల్లాడ మండలాల్లోని ఎరువులు దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు‌ మంగళవారం దాడులు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో సిబ్బంది వైరాలోని నాగేశ్వరరావుకు చెందిన ఎస్వీ ట్రేడర్స్.. తల్లాడ మండలం మిట్టపల్లిలోని లక్ష్మి నరసింహారావుకు చెందిన పసంగుఫాటి ట్రేడర్స్ దుకాణంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించి చట్ట విరుద్ధంగా రూ. 1.80 లక్షల విలువ చేసే ఎరువులను నిల్వ చేసినట్లు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. అదేవిధంగా కొణిజర్ల మండలం చిన్న మునాగాలలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాల పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్ చేశారు.

Next Story