వాష్ రూమ్‌లో 1.36 కేజీల బంగారం.. షాక్ అయిన అధికారులు..

by  |
వాష్ రూమ్‌లో 1.36 కేజీల బంగారం.. షాక్ అయిన అధికారులు..
X

దిశ, వెబ్ డెస్క్ : చెన్నై ఇంటర్నేషనన్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 1.36 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానంలోని వాష్ రూమ్ క్లీన్ చేస్తుండగా విమాన సిబ్బంది బంగారాన్ని గుర్తించారు.

వెంటనే సిబ్బంది.. కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విమానంలో బంగారం ఎవరు దాచారనే విషయంపై ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed