ఎంసెట్ ఎంట్రన్స్ ఫీజు తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్

by Disha Web Desk 13 |
ఎంసెట్ ఎంట్రన్స్ ఫీజు తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ ఫీజులు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్‌ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యామండలి ఎంసెట్ తో పాటు అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశారని, నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఎంసెట్, ఈసెట్ ఫీజులను ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ ఫీజులు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి.. కాబట్టి వెంటనే ఎంసెట్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా మంది 2. 51 లక్షల మంది రాసే ఎంసెట్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులకు ఎంట్రన్స్ ఫీజు రూ 400 కాగా బీసీ, ఇతర విద్యార్థులకు 800 గా నిర్ణయించారని తెలిపారు.

ఇది దుర్మార్గపు చర్యగా ఎస్ఎఫ్ఐ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు రూ 500 ఉందని బీసీలకు రూ 550 ఇతర విద్యార్థులకు 600 ఉందన్నారు. తెలంగాణ కూడా బీసీ విద్యార్థులకు ఇలాంటి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉన్నత విద్యామండలి కరోనా సయమంలో సీఎం సహాయనిధికి 10 కోట్ల విరాళాలు ఇచ్చిందని, కానీ విద్యార్థులకు ఫీజులు మాత్రం తగ్గించలేరా ? అని ప్రశ్నించారు. పేద బీసీ విద్యార్థులకు ఎందుకు ఫీజులో మినహాయింపు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎంసెట్ తో పాటు ఇతర అన్ని సెట్లలో ఫీజులు తగ్గించి విద్యార్థులు అందరికీ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణ లోనూ బీసీ విద్యార్థులకు ఫీజులో రాయితీ కల్పించాలని, లేకుంటే ఖచ్చితంగా ఉన్నత విద్యామండలి కార్యాలయాని ముట్టడిస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed