పురుగుల మందు తాగి.. యువకుడి ఆత్మహత్య

by  |
పురుగుల మందు తాగి.. యువకుడి ఆత్మహత్య
X

దిశ, కల్వకుర్తి: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కడ్తాల్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కడ్తాల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ కుమారుడు రాధాకృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఆ యువకుడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story