- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: చైనాకు చెందిన 59 యాప్ లను భారత్ నిషేధించిన తర్వాత… అందరి దృష్టి జూమ్ యాప్ పైకి మళ్లింది. లాక్ డౌన్ సమయంలో కాన్ఫరెన్సింగ్ యాప్గా జూమ్ బాగా పాప్యులర్ అయిన సంగతి తెలిసిందే. అన్ని రకాల కాన్ఫరెన్సులతో పాటు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు కూడా జూమ్ యాప్ ద్వారా జరుగుతున్నాయి. ఈ తరుణంలో జూమ్ యాప్ను ఎందుకు నిషేధించడం లేదనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం జూమ్ కూడా చైనా యాప్ అనే భావన ఉండటమే. దీంతో, జనాలు గూగుల్ మీట్, జియో మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవలి కాలంలో వీటి డౌన్ లోడ్లు భారీ ఎత్తున పెరిగాయి.
ఈ నేపథ్యంలో, తమది చైనాకు చెందిన సంస్థ కాదని జూమ్ చెబుతోంది. తమకు ఎప్పటికీ ఇండియా ముఖ్యమైన మార్కెట్ గానే ఉంటుందని జూమ్ ఇంజినీరింగ్, ప్రాడక్ట్స్ అధ్యక్షుడు వెల్చామి శంకరలింగం తెలిపారు. జూమ్ యాప్ ను చైనాతో ముడిపెడుతూ వార్తలు వస్తుండటం బాధిస్తోందని చెప్పారు. జూమ్ యాప్ అమెరికాకు చెందినదని తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్ జోన్స్ లో దీన్ని స్థాపించారని చెప్పారు. కంపెనీ సీఈవో ఎరిక్ ఎస్ యువాన్ మూలాలు చైనాలో ఉండటం వల్ల జూమ్ ను చైనా కంపెనీగా అపోహ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.