కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి: టీటీడీ చైర్మన్

by  |
కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి: టీటీడీ చైర్మన్
X

దిశ, ఏపీ బ్యూరో: పెద్ద నోట్ల సందర్భంగా రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద ఉండిపోయాయని, వాటిని కొత్త నోట్లతో మార్పిడీ చేయాలని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరారు. సోమవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన సందర్భంగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు.

Next Story