ఐదో రోజుకు షర్మిల పాదయాత్ర.. ఇవాళ కొనసాగేది అక్కడే

by  |
ఐదో రోజుకు షర్మిల పాదయాత్ర.. ఇవాళ కొనసాగేది అక్కడే
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. నేడు(ఆదివారం) ఉదయం 9.30 గంటలకు మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామం నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ కొత్తతండ, డబ్లీగూడ, మన్సాన్‎పల్లి, కొత్వాల్ చెరువు తండా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు మహేశ్వరం సభలో షర్మిల ప్రసంగించనుంది.



Next Story

Most Viewed