ఎంపీపై మరో ఎమ్మెల్యే ఫిర్యాదు

by  |
ఎంపీపై మరో ఎమ్మెల్యే ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నరసాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై మరో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న శ్రీరంగనాథరాజు, ప్రసాదరాజు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నేడు తణుకు పోలీస్ స్టేషన్‌లో కారుమూరు వెంకట నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని, పందులు పేరిట తమను కించపరిచారని, నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ప్రవర్తించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Next Story

Most Viewed