‘తండ్రినే ఇరికిస్తున్నావా చిట్టినాయుడు’

by  |
‘తండ్రినే ఇరికిస్తున్నావా చిట్టినాయుడు’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఫైబర్ గ్రిడ్‌తో అప్పటి ఐటీశాఖ మంత్రికి సంబంధంలేదన్న చిట్టినాయుడు.. ఫైబర్ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని కక్కేశాడని తెలిపారు. ‘నీకు కాకపోతే అప్పటి సీఎం మీ నాన్నకు సంబంధం ఉందా’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు . ‘తండ్రినే ఇరికిస్తున్నవా? చిట్టినాయుడు’ అని ఎద్దేవా చేశారు. ఈవీఎం దొంగ హరిప్రసాద్‌ను ఐటీ అడ్వైజర్‌గా ఎవరు పెట్టారని లోకేష్‌ను ట్విట్టర్ మాధ్యమంగా అడిగారు.

Next Story

Most Viewed