హైదరాబాద్‌కు షర్మిల.. ఉత్కంఠకు తెర దించేనా !

by  |
హైదరాబాద్‌కు షర్మిల.. ఉత్కంఠకు తెర దించేనా !
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి హైదారాబాద్ చేరుకున్నారు. సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బ్రదర్ అనిల్, షర్మిల.. హైదరాబాద్‌లోని తమ నివాసం లోటస్‌పాండ్‌కు వచ్చారు. మంగళవారం ఉదయం 10గంటలకు వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో షర్మిల పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గల వైఎస్, షర్మిల అనుచరులకు ఇప్పటికే ఫోన్లు చేసి రేపటి సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు సమాచారం. షర్మిల ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ స్థాపించబోతున్నారన్న ప్రచారంతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Next Story

Most Viewed