సీ‌ఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

by  |
సీ‌ఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం మాత్రం ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు. కేసీఆర్ దొరగారు బెడ్లు దొరకక, ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు… కాస్త మీ ప్రతీకార రాజకీయలను పక్కన పెట్టి కరోనా నుంచి ప్రజలను కాపాడండి అన్నారు. అలానే కరోనా కిట్లు అందట్లేదని లక్షల మంది కాల్ సెంటర్లకు కాల్ చేసే వారికి కిట్లను ఇవ్వండి. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి మందులను, ట్రీట్మెంట్లను ఉచితంగా అందించండని ట్వీట్ చేశారు. కాస్త మీ ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం పై దృష్టి సారించాలని సూచించారు.



Next Story