తాడేపల్లిలో ఇల్లు కట్టి ప్రజల్ని మాయచేశారు !

by  |
తాడేపల్లిలో ఇల్లు కట్టి ప్రజల్ని మాయచేశారు !
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి అంగీకరించిన వైఎస్ జగన్.. ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టి ప్రజలను మాయ చేశారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. అమరావతి చుట్టు పక్కల అంతా దళిత నియోజకవర్గాలే ఉన్నాయని, దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో రాజధాని ఉండటం జగన్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. ఇప్పుడు రాజధానిపై మూడు ముక్కలాటకు తెరదీశారని, రైతులు ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా మంత్రులే నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు వచ్చాయని అన్నారు.

Next Story

Most Viewed