అర్ధరాత్రి ఆ పనేంటని అడిగినందుకు.. 20 మంది కలిసి..

by  |
Old City Attacks
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి యువకులు రెచ్చిపోయారు. ఇంటి ముందు కూర్చొని అల్లరిచేస్తున్నారని ప్రశ్నించినందుకు 20 మంది గ్యాంగ్ కుటుంబంపై దాడి చేశారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఇంటి ముందు కొందరు యువకులు సయ్యద్ తారిక్, అతని బంధువులను అల్లరి చేస్తుడటంతో వారిని అక్కడి నుంచి వెళ్లి పోవాలని సల్మాన్ వారికి సూచించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు సల్మాన్‌తో గొడవకు దిగారు. తర్వాత మరికొందరు వచ్చి కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సల్మాన్ కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయి.



Next Story

Most Viewed