ప్రాణం తీసిన కరోనా భయం.. యువకుడి ఆత్మహత్య

by  |
ప్రాణం తీసిన కరోనా భయం.. యువకుడి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభించడమే కాకుండా చాలా మందిని బలి తీసుకుంటోంది. దేశంలోని చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వ్యా్క్సిన్ కొరత వలన కరోనా రోగులు పెద్ద మొత్తంలో మరణిస్తున్నారు.అంతేకాకుండా ఎక్కడ తమకు కరోనా సోకుతుందేమో అని భయంతో పలువురు బలవణ్మరనాలకు పాల్పడుతున్నారు.

తాజాగా విశాఖలో కరోనాకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్ భవనం మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడికి స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తనకు ఎక్కడ కరోనా వచ్చిందేమోనని భయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

Next Story

Most Viewed