ప్రియుడి వేధింపులు తాళలేక.. పురుగులమందు తాగిన యువతి

by  |
ప్రియుడి వేధింపులు తాళలేక.. పురుగులమందు తాగిన యువతి
X

దిశ, బెజ్జూర్: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్ మండలంలో సోమవారం రాత్రి జరిగింది. బెజ్జూర్ ఎస్ఐ సాగర్ వివరాల ప్రకారం.. మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన దుర్గం మనీషా, అదే గ్రామానికి చెందిన జిమ్మిడి సుభాష్‌ ఇరువురు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అంతేగాకుండా.. గత నాలుగు నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. సోమవారం సుభాష్ తాగిన మైకంలో మనీషాను శారీరకంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన మనీషా పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దుర్గం వెంకటి ఫిర్యాదు మేరకు సుభాష్‌పై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు.

Next Story