ఆ యువతి ఆరేళ్ల ప్రేమ.. గ్రామ చరిత్రలో కలిసిపోయిందీలా..!!

by  |
young women suicide
X

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా నాలుగేళ్లు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇక జీవితాంతం అతనితోనే ఉంటానని ఎన్నో ఆశలు పెట్టుకొంది ఆ అమ్మాయి. కానీ, ఆ ఆశలు అడియాశలని తెలిసొచ్చింది. ప్రేమించినవాడు మరో యువతితో పెళ్ళికి రెడీ అయ్యేసరికి తట్టుకోలేకపోయింది. ఆ బాధ కన్నా చావే మేలనుకుంది. ప్రేమ విఫలమవ్వడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆ యువతి నాలుగేళ్ళ ప్రేమ ఆ గ్రామ చరిత్రలో నిలిచిపోయింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన గాడుదుల రామచంద్రు, లక్ష్మమ్మ దంపతుల నాలుగో కుమార్తె ఉమ(22) హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చదువుతోంది. ఆరేళ్లుగా అదే గ్రామానికి చెందిన నర్సింగ్‌ ఉమేష్, ఉమ ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కరోనా లాక్ డౌన్ వలన ఇంటికొచ్చిన ఆమెకు ఉమేష్ కి వేరే యువతితో పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసింది. ప్రేమించినవాడికి మరో అమ్మాయితో వివాహం నిశ్చయమయ్యేసరికి మనస్థాపానికి గురైన ఉమ సోమవారం హైదరాబాద్ లోని తన రూమ్ కి వచ్చింది. మంగళవారం తీవ్ర మనోవేదనకు గురైన ఉమ గదిలో తలుపులు బిగించి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంత పిలిచినా ఉమ తలుపులు తీయకపోవడంతో అనుమానమొచ్చిన ఇంటి యజమాని తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్ కి విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed