ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' మొదలయ్యేది అప్పుడేనట.. ఇక రచ్చ రచ్చే

by  |
evaru meelo kotiswarulu news
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించి బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటూ హాట్ సీట్ లో ప్రశ్నలు అడగడానికి సిద్దమైపోయాడు. బుల్లితెర రియాల్టీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని పక్కన పెట్టి కొత్తగా మరో ప్రముఖ ఛానల్ కొత్త సీజన్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ షో కి సంబంధించి ప్రోమోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈపాటికే ఈ షో మొదలు కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన విషయం విదితమే. ప్రస్తుతం కరోనా కట్టడిలోనే ఉండడం, లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఈ షో గేట్లు తెరుచుకున్నాయి. త్వరలోనే ఈ షో తో ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయనున్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ వచ్చే వారం నుంచి ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడట.

కరోనాకు ముందు చేసిన ఎపిసోడ్స్ ని కూడా కొన్ని కారణాల వలన రీ షూట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ రియాలిటీ షో ఆగస్టులో మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ గ్యాప్ లో ఈ షో లో పాల్గొననుండడంతో మొదటే కొన్ని ఎపిసోడ్స్ ని షూట్ చేసి వాటిని ప్రసారం చేయన్నునారట. ఇక ఎన్టీఆర్ హోస్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రియాలిటీ షో తో ఆ ఛానల్ కి టీఆర్పీ ఒక రేంజ్ లో వస్తుందని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.



Next Story

Most Viewed