బీజేపీలో చేరితే సరిపోదు.. పార్టీని పటిష్ట పర్చాలి

by  |
BJP-district-president-Nare
X

దిశ, సంగారెడ్డి: కేవలం పార్టీలో చేరితే సరిపోదని, పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి కోరారు. బుధవారం కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి నరేందర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశాన్ని, ధర్మాన్ని రక్షించేందుకు పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని, ఇందులో భాగంగానే నేడు యువత అంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.

ఇతర రాజకీయ పార్టీల్లాగా బీజేపీ పార్టీ కుటుంబ పార్టీ కాదని, సాధారణ కార్యకర్త కూడా పార్టీలో ఉన్నత పదవులు అదిరోహించిన చరిత్ర బీజేపీకి ఉందన్నారు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేయనున్న పాదయాత్రను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ఇటీవలే అకాల మరణం చెందిన మండల ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌‌కు సంతాపం పాటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు సాయికుమార్, బార్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు చంద్రశేఖర్, హనుమంత్‌రెడ్డి, రవీందర్, ఎల్లయ్య, ప్రశాంత్‌కుమార్, అంజనేయులు, మారేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.


Next Story