పనిచేయమంటే.. ప్రాణమే తీసుకున్నాడు..!

by  |
పనిచేయమంటే.. ప్రాణమే తీసుకున్నాడు..!
X

దిశ, ఆదిలాబాద్: ఆ యువకుడికి రెండు నెలల క్రితం వివాహమైంది. అయినా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. అప్పటికే తండ్రి పలుమార్లు మందలించాడు. శుక్రవారం మరోసారి తండ్రి ఏదో పని చేసుకోవచ్చుగా అంటూ తీవ్ర స్థాయిలో మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలం చింతలపేటకు చెందిన మరాంపెళ్లి రంజిత్ (22)కు రెండు నెలల కిత్రం జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన గాయత్రి అనే అమ్మాయితో వివాహమైంది. అయితే ఏ పని చేయకుండా రంజిత్ జూలాయిలా తిరుగుతున్నాడు. దీంతో అతని తండ్రి రవి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయిలో జరిగింది. మనస్థాపం చెందిన రంజిత్ శుక్రవారం ఇంటిలోని దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Next Story

Most Viewed