- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ఓ కుర్రాడి ప్రాణం తీసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. పెద్దపెల్లికి చెందిన చైతన్య అనే కుర్రాడు బీటెక్ పూర్తి చేసి జాబ్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఎస్ ఆర్ నగర్ లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. మిత్రుడి పిలుపు మేరకు తన స్నేహితుల రూమ్ కు వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేందుకు పటాన్ చెరు నుంచి దిల్ సుఖ్ నగర్ వస్తున్న సిటీ బస్సు ఎక్కాడు. బస్సులో కిటికీ పక్కనే కూర్చున్నాడు. కొద్ది సేపటికి తన పక్కన ఉన్న ప్రయాణికుడు చైతన్యను చూసేసరికి అతని తలకి పెద్ద గాయమయ్యి రక్తస్రావం అవుతుంది వెంటనే అతన్ని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు అప్పటికే అతను మృతి చెందాడు. బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బస్సు డ్రైవర్ యత్నించిన సమయంలో బస్సు టైరు గుంతలో పడింది. దీంతో చైతన్య తల కిటికీ అద్దానికి బలంగా తాకి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.