బర్త్ డే రోజు లిక్కర్ పార్టీ.. ప్రాణం పోయింది..!

by  |
బర్త్ డే రోజు లిక్కర్ పార్టీ.. ప్రాణం పోయింది..!
X

దిశ, వెబ్‌డెస్క్: బర్త్ డే పార్టీ వేడుక విషాదాన్ని నింపింది. మందులో చిందేసిన బర్త్ డే బాయ్ నిద్ర మత్తులోనే కన్నుమూశాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌లో వెలుగుచూసింది. తమిళనాడుకు చెందిన కేశవ ప్రసాద్‌ అనే యువకుడు నగరంలోని ఓ కాల్‌ సెంటర్‌లో పని చేస్తూ రెజిమెంటల్ బజార్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం బర్త్ డే కావడంతో ఇంటికి స్నేహితులను పిలిచి పార్టీ చేసుకున్నాడు.

మద్యం సేవించిన అనంతరం ఎవరి దారిన వారు వెళ్లారు. కానీ, ఉదయం అయినా.. కేశవ ప్రసాద్‌ ఎంతకీ నిద్రలో నుంచి మేల్కోలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన మిత్రులు నిద్రలేపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శరీరంలో చలనం లేకపోవడంతో.. మృతి చెందినట్టు గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మద్యం సేవించడంతోనే నిద్రలోనే మరణించాడా.. లేక ఇంకేమైనా ఇతర కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed