మద్యానికి బానిసై మత్తులో అలా చేసిన వ్యక్తి.. అనాథలైన పిల్లలు

by  |
మద్యానికి బానిసై మత్తులో అలా చేసిన వ్యక్తి.. అనాథలైన పిల్లలు
X

దిశ, ఖానాపూర్: మద్యానికి బానిసై ఓయువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. గాజుల రాజు అనే (40) అనే వ్యక్తి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కూలి పని చేసుకునేవాడని, కానీ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా మద్యం మత్తులోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతునికి భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed