- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,మణుగూరు : ఓ యువకుడు రైల్వే ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని రైల్వే అటవీ ప్రాంతంలో యువకుడు చెట్టుకు ఉరి వేసుకున్నాడని స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎస్.ఐ నరేష్, తమ సిబ్బందితో కలసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే….మణుగూరు మండలం గుట్టమల్లారం ప్రాంతానికి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటర్ వర్క్ చేస్తాడని సమాచారం. రాముకి తల్లి,చెల్లి ఉన్నారు. రాము వివాహితుడు. అయితే రాము మద్యానికి అలవాటు పడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఎస్.ఐ నరేష్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాము చెట్టుకు ఉరి వేలాడుతూ కనిపిచడంతో ఆ తల్లి రోధనలు మిన్నంటాయి.