పీఎస్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

by  |
పీఎస్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, నిజామాబాద్ రూరల్: మద్యం మత్తులో ఓ యువకుడు పోలిస్ స్టేషన్ ఎదుట నిప్పంటిచుకుని అత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన పెంట స్వామి పెయింట్ లో కలిపే ద్రావణం (టార్ పెంట్ ఆయిల్) ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సహయంతో పోలీసులు మంటలను అర్పి ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై ఎస్ఐ పాండేరావును వివరణ కోరగా గతంలో కూడా రెండు, మూడు సార్లు వెంకటస్వామి మండల కేంద్రంలోని మార్కెట్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అందరినీ భయబ్రాంతులకు గురి చేశాడని, అప్పుడు కూడా గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది అతడిని కాపాడారని అన్నారు. అయితే, ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో తీసుకుంటున్నాడని ఎస్సై పేర్కొన్నారు.

Next Story

Most Viewed